[మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదల – వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదలైందట. ’తపాలా బాల’ అంటూ సావిత్రిని గొప్పగా కీర్తిస్తూ పత్రికలలో వచ్చాయి చదివావా?
సుబ్బారావు:
సావిత్రి గురించిన కథనాలు చదవకుండా ఎలా ఉంటాను? చదివాను. అయితే ఏం?
సుబ్బలష్షిమి:
ఇప్పుడింతగా ఆవిడ కళ్ళు చారడనీ, నటన బారెడనీ కీర్తిస్తున్నారే, మరి 1980 లో, ఆవిడ సంవత్సరం పాటు కోమాలో పడుండగా, ఒక్క పేపరంటే ఒక్కరూ ‘ఇదేమిటి జెమినీ గణేశా!’ అనలేదు. ఎంతగా తెగతెంపులయినా ఒకప్పుడు పెళ్ళి చేసుకున్న, ఆస్తులిచ్చిన భార్యే గదా! ఒక్క పత్రికా అతణ్ణి బాధ్యుణ్ణి చెయ్యలేదు. పోనీ గదాని భుజ్ భూకంప బాధితుల కోసమో, కడలూరు సునామీ బాధితుల కోసమో విరాళాలు వసూలు చేసి ఇళ్ళు కట్టించినట్లుగా ఎంతో కొంత విరాళాలన్నా వసూలు చేసి సహాయమూ చెయ్యలేదు. తోటి నటీనటులు ఏ సహాయమూ చెయ్యలేదు. దారుణమైన యాతనపడి, ‘పోయింది’ కదా ఆ మహానటి?
సుబ్బారావు:
అంతే మరదలా! చచ్చినోడి కళ్ళు చారెడంటారు.
***********
hmmm
ReplyDeletesaameta baagundi
ReplyDelete