[రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్టు – వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
తమ పగవారిపై యాసిడ్ దాడి కేసులో అరెస్టయిన రాప్తాడు కాంగ్రెసు అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి, గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలో మూడేళ్ళు జైల్లో ఉండి వచ్చాడట. ఇంత నేర చరితులకి ఎన్నికల్లో పొల్గొనే అర్హత ఎలా వచ్చింది బావా? అదే మనలాంటి సామాన్యులకి పాస్ పోర్ట్ కావాలన్నా, కష్టపడి చదివి ఐ.ఏ.ఎస్.కో లేక ఐ.పి.ఎస్.కో వ్రాత పరీక్షలూ, ఇంటర్యూలలో గట్టెక్కినా, శిక్షణకీ ప్రవేశం రావాలంటే స్థానిక పోలీసు స్టేషన్ లలో నుండి క్లీన్ చిట్ పొందుపరచాల్సి ఉంటుంది గదా! మరి అవేవీ రాజకీయ నాయకులకి వర్తించవా?
సుబ్బారావు:
బహుశః తమ జీతభత్యాలు పెంచుకుంటూ ఎంచక్కా రాజ్యాంగ సవరణలు చేసుకున్నట్లు, గప్ చుప్ గా ఇలాంటి విషయాల్లోనూ ఏవో మినహాయింపులూ, మతలబులూ చేసుకున్నారేమో మరదలా! ఈ రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి ఒక్కడేనా ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పశువుల దాణా కుంభకోణం లో జైలుకు వెళ్ళి రాలేదా? శిబుసోరన్ తన పి.ఏ. హత్య కేసు విషయంలో జైలుకు వెళ్ళిరాలేదా? బహుశః ఇంకా కేసులు కోర్టులో సా………గ దీయబడుతూ ఉంటాయి. ఇంకా తీర్పువెలువడి తమ దోషులుగా నిరూపించబడలేదు గనుకా, కేవలం నిందుతులు మాత్రమే గనుకా నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్నరూల్ తమకు వర్తించదు అని చట్టసవరణలు చేసుకుని ఉంటారు.
సుబ్బలష్షిమి:
మొత్తానికి ప్రజలకో న్యాయం, రాజకీయనాయకులకీ, వారి మిత్రులకీ ఒక న్యాయం! ఏం ప్రజాస్వామ్యం బావా ఇది?
సుబ్బారావు:
ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే అది నీ అమాయకత్వం మరదలా! ఇది ప్రజాస్వామ్యం కాదు. దొంగల రాజ్యం, అంతే!
*********
Bhalega chepparandi ... mee vyengam lo kooda matalabu undi
ReplyDelete