[విశ్వసనీయత లేకుంటే… అన్నేళ్ళు ఎలా పాలించాను? నా పాలనలో ఒక్క కుంభకోణం జరగలేదు – చంద్రబాబు వ్యాఖ్యల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! విశ్వసనీయత లేకుంటే అన్నేళ్ళు ఎలా పాలించానంటున్నాడు చంద్రబాబు. అక్కడికి ప్రజల కేదో నిర్ణయాధికారం ఉన్నట్లు! అదే ఉంటే – మొన్న చంద్రబాబునీ, నిన్న వై.యస్సార్ నీ, ఈ రోజు సోనియా మన్మోహన్ లనీ సీట్లలో కూర్చోనిచ్చేవారా? ఎన్నికల్లో గెలవటానికి ఎవరి దారులు వారివయ్యె!
పైగా విశ్వసనీయతకి తననే చెప్పుకోవాలట. తన పాలనలో కుంభకోణాలు జరగలేదట.
సుబ్బారావు:
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పంపించాడు మరి. ఖచ్చితంగా విశ్వసనీయతకి ఇతణ్ణే చెప్పుకోవాలి. ఇక అవకతవకల గురించి అంటావా? చంద్రబాబు దోపిడి వై.యస్.ఆర్ దోపిడి ముందు బలాదూర్. అలాగే వై.యస్సార్ దోపిడి కంటే ఎక్కువ దోపిడి చేసే ముఖ్యమంత్రి వస్తే, అప్పుడు వై.యస్.ఆర్. దోపిడి కూడా చాలా తక్కువే అనేయవచ్చు.
ఈ దోపిడిలను జనం మెదళ్ళ నుండి మైమరిపించటానికి మీడియా ఎలాగూ ఉండనే ఉంది. రాజకీయులకీ, మీడియాకీ ప్రజలు పెద్ద గజనీలనే అభిప్రాయమయ్యె!
No comments:
Post a Comment