Friday, June 12, 2009

చావు బతుకులలో మొద్దు శ్రీను హంతకుడు

[మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడు ఓంప్రకాష్ రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమ శ్వాస పై ఉన్నాడు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొద్దుశ్రీను హత్యజరిగినప్పుడు, ఈ ఓంప్రకాష్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా “అందరు తనగురించి చెప్పుకుంటారని, అందుకోసం తానే మొద్దుశ్రీనును హత్య చేసానని” చెప్పుకున్నాడు. అప్పుడు ఈ నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో తాను ‘పైపైకి’ పోతాను అనుకున్నాడు. ఇప్పుడు ఇలా చావుబ్రతుకులలో ఉన్నాడు.

సుబ్బారావు:
అంతే మరదలా! వెనుక రాజకీయ హస్తం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, రోగాలు వస్తాయి, చస్తారు కూడా! అలాగే ఓంప్రకాష్ కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోగం వచ్చి, రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమశ్వాసతో ఉన్నాడు. ఇప్పుడు కూడా పైకే పోతాడు.
*********

Thursday, June 11, 2009

61 ఏళ్ళుగా ఒకే కుటుంబపాలన

[ఉత్తర కొరియాలో 61 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కుటుంబం. కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటిస్తూ నిఘాసంస్థలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి – వార్త నేపధ్యంలో]



[పచ్చి చేపలు నగ్న నృత్యాలు కిమ్‌ జో ఇల్‌కు ఇష్టం
లండన్‌, జూన్‌ 3: 'తాజా' చేపలంటే చాలా మందికి ఇష్టం!ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జో ఇల్‌కు కూడా ఇష్టమే. అవి ఎంత తాజాగా ఉండాలంటే… అప్పుడే నీళ్లలోంచి తీయాలి. తోక గిలగిలా కొట్టుకుంటూ ఉండాలి. అలాంటి చేపలను… పచ్చిగా తినడమంటే ఆయనకు చాలా ఇష్టమట! ఈ విషయాన్ని ఆయన దగ్గర వంటవాడిగా పని చేసిన కెంజీ ఫుజిమొటో 'ది సన్‌' పత్రికకు తెలిపాడు.
"పచ్చి చేపలను తినడమంటే కిమ్‌కు చాలా ఇష్టం. అలాగే... తరచూ విలాసవంతమైన విందులు ఏర్పాటు చేసేవాడు. అమెరికన్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌ పెట్టి... నగ్నంగా నృత్యం చేయాలని మహిళలను ఆదేశించేవాడు'' అని కెంజీ వివరించాడు. కెంజీ ఉత్తర కొరియా నుంచి పారిపోయి ప్రస్తుతం జపాన్‌లో నివసిస్తున్నాడు – వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఉత్తర కొరియాలో 61 ఏళ్ళుగా ఒకే కుటుంబం అధికారంలో ఉందిట. అన్నీ దేశాలూ మనలాగే ఉన్నాయి కాబోలు. పైగా ఈ ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఇల్, తన మూడవభార్య కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటిస్తూ, జాతీయ శాసనసభ్యులు, నిఘా సంస్థలు తమకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

సుబ్బారావు:
అవును మరదలా! ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో రాణించాలంటే నిఘా సంస్థల సహకారం తప్పని సరి. మొన్న నేను చెబితే నమ్మకుంటివి గదా! ఇప్పుడు పేపరులో వ్రాస్తే ఒప్పుకుంటున్నావా?

సుబ్బలష్షిమి:
అవును బావా! అప్పుడు నమ్మశక్యం కాలేదు గానీ, ఇప్పుడు చూస్తే నిజమే నన్పిస్తోంది. రాజకీయమూ, గూఢచర్యమూ పాలూ నీళ్ళలా కలిసిపోయినట్లున్నాయి.

సుబ్బారావు:
అవునులే మరదలా! మనందరం ‘పేపరు వాళ్ళు నందంటే నంది, పందంటే పంది అని’ అవి చెప్పేవాటికి అలవాటు పడ్డాం! లేకపోతే కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ గురించి వ్రాస్తూ, ఆఫ్గాన్ పర్యటనలో మీటింగ్ లలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో వీడియో గేములు ఆడుకున్నాడని, కరీనా కపూర్ కు SMS లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడని వ్రాసిన మీడియాకు[ముఖ్యంగా ఈనాడుకు], ఇప్పుడు రాహుల్ గాంధీ అల్ రౌండర్ మేధావిలాగా కన్పిస్తున్నాడు.

*****