Friday, November 20, 2009

కొండని తవ్వి ఎలుకని పట్టటమంటే…..

[యడ్యూరప్పా……. అందరితో మాట్లాడప్పా!

కన్నడనాట పాలక పక్షంలో ఇటీవలి సంక్షోభానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన సహచరులతో మాటామంతీ లేకుండా భీష్మీంచుకు కూర్చోవటమేనని భాజపా అధిష్టానం తరపున సుష్మాస్వరాజ్ తేల్చి చెప్పారు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
సుష్మాస్వరాజ్ విలేఖరులతో మాట్లాడుతూ “ఇటీవలి సంక్షోభానికి కారణాన్ని కనుగొన్నాం. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహచరులతో మరింత చురుగ్గా సంప్రదింపులు సాగించాల్సి ఉంది!” అని చెప్పిందట, విన్నావా బావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! అయితే…. ఇటీవలి కర్ణాటక సంక్షోభానికి వాటాల గొడవ, శోభా కరంద్లాజేలూ, గాలిసోదరులూ కారణం కాదన్నమాట. యడ్యూరప్ప మూతి మూడుచుకు కూర్చోవటమే అసలు కారణమన్నది నిజంగా అద్భుతమైన పరిశోధన మరదలా! ఈ పరిశోధనకై సుష్మాస్వరాజ్ కి నోబెల్ కు తక్కువ కాకుండా బహుమానం ఇవ్వాలి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కొండని తవ్వి ఎలకని పట్టింది కదా! నోబెల్ వంటి బహుమానం ఇవ్వాల్సిందే మరి!

No comments:

Post a Comment