Saturday, July 25, 2009

తనది కాకపోతే కాశీదాకా డేకమని

సుబ్బలష్షిమి:
బావా! వానా కాలం వచ్చినా, ఇంకా కరెంటు కోత ఉంటూనే ఉందీ?

సుబ్బారావు:
కరెంటు కొరత ఉందంట మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! మనముఖ్యమంత్రి గారి దగ్గర అవినీతిమార్గలకు మాత్రం ’కొరత’ ఉండదు. తనకి నచ్చని వారిని ’ఎన్నివిధాలు’గా వేధించవచ్చో, ప్రతిపక్షాల వాళ్ళని ఎలా ’అకర్షి’ంచవచ్చో, కొడుకుకి డబ్బు ఎలా కూడబెట్టవచ్చో ఇవన్నీ తెలుసుకానీ, ప్రజల దగ్గరకి వచ్చేసరికి అన్నీటికి కొరతలే! సర్ధుకోవాలని చెబుతాడు.

సుబ్బారావు:
దీన్నే అంటారు మరదలా! ’తనది కాకపోతే కాశీదాకా డేకమని’.

Wednesday, July 22, 2009

ధరలు కాదు అదుపులో ఉంది , ……….

[కందిపప్పు ధర తప్ప మిగిలిన ధరలన్నీ అదుపులోనే ఉన్నాయన్న ముఖ్యమంత్రి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా, ఈ ముఖ్యమంత్రి ఇలాగంటున్నాడు? బియ్యం కిలో 35/-రూ. కీ, అన్నిపప్పులు, పంచదార, కూరగాయలతో సహా రేట్లు అన్ని పెరిగి ఉంటే, ఒక్క కందిపప్పు ధర తప్ప మిగిలిన వస్తువుల ధరలన్నీ అదుపులోనే ఉన్నాయంటున్నాడు?

సుబ్బారావు:
ఓసి పిచ్చిమరదలా! ముఖ్యమంత్రి మాటలకి అర్ధం అది కాదు. ’ధరలు కాదు అదుపులో ఉంది, ప్రజలన్నమాట’. తెలిసిందా! ఎందుకంటే ప్రజలు ఎటూ బియ్యం కూరగాయలూ, ఇతర వస్తువుల ధరలకి అలవాటు పడిపోయారు కదా?

సుబ్బలష్షిమి:
బాబోయ్! అంటే కందిపప్పు ధరకూడా 80/-Rs. నుండి 90/-Rs. దాకా ఉండటానికి అలవాటు పడిపోయాక, కందిపప్పు ధర కూడా అదుపులోనే ఉందంటాడన్న మాట.

సుబ్బారావు:
మరంతే!
*************