Friday, September 10, 2010

ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు, ఈ రాజకీయ నట వారసుడు!

[చనిపోయిన వారిపై విమర్శలా! ప్రకాశం ఓదార్పు యాత్రలో జగన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రతికున్న వారిని విమర్శిస్తే వివరణలైనా ఇచ్చుకుంటారు. చనిపోయిన వారిని సైతం విమర్శిస్తున్నారు. రాజకీయాలు అంత నీచంగా తయారయ్యాయని కడప ఎంపీ వై.యస్.జగన్ అన్నాడట. తండ్రి అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని సొమ్ము కట్టబెట్టినప్పుడు రాజకీయాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి కాబోలు బావా! పైగా చనిపోయిన వారిని విమర్శించ కూడదట. చేసేవన్నీ చేసినా, దోచుకున్నంత దోచుకున్నా, చచ్చిపోయాడు కాబట్టి అడగ కూడదు. తండ్రి వారసత్వంగా సీఎం సీటు కావాలట, అతడి అక్రమార్జనలూ కావాలట, విమర్శలూ విచారణలూ మాత్రం వద్దట. అవకాశ వాదం కూడా వారసత్వంగా అబ్బింది ఈ ఓదార్పు వీరుడికి!

సుబ్బారావు:
ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు మరదలా! మరి రాజకీయ నట వారసుడు కదా!

4 comments:

  1. మీ టపాకాయలు బాగా పేలుతున్నాయి.

    ReplyDelete
  2. AMMA ODI గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

    హారం

    ReplyDelete
  3. సుబ్బారావుగారు ఎంత భాగా చెప్పారండి.

    ReplyDelete