[ఓదార్పు యాత్ర వద్దని జగన్ కి సోనియా సూచించిన వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! జగన్, తండ్రి వై.యస్. చనిపోయినప్పుడు, మృతి చెందిన అభిమానులని ఓదారుస్తానంటూ యాత్ర చేపడతానంటాడు. సోనియా వద్దంటోందట. ఖమ్మంలో యాత్ర సజావుగానే జరిగినా, వరంగల్ లో తెరాస శ్రేణులు, తెలంగాణా వాదులూ అడ్డుకున్నారు. చివరగా ‘నో’ అంటూ సోనియా పైకి తేలింది. అంటే అప్పుడు వరంగల్ లో అడ్డుకున్న వారి వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది బావా?
సుబ్బారావు:
ఇంకెవరిది? సోనియాదేనని స్పష్టంగా తేలింది కదా మరదలా!
సుబ్బలష్షిమి:
పైగా.... అందరినీ ఒకేచోట చేర్చి, వాళ్ళని కలిసి, సాయం అందించాల్సిందిగా సోనియా సూచించిందట. ‘మీరంతా ఏడుస్తూ ఇడుపులపాయ రండి. మేమొచ్చి మిమ్మల్ని ఓదార్చుతాం. ఆపైన ఫోటోలు తీసుకుని పేపర్లో, వీడియోలు తీసుకుని టీవీలో వేస్కుంటాం’ అనాలన్న మాట! ఎంత గొప్ప సంస్కారం బావా? బాధల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తారా, వాళ్ళని మన దగ్గరికి పిలిపించి ఓదారుస్తారా?
సుబ్బారావు:
బహుశః అది సోనియా సాంప్రదాయమేమో మరదలా!
Thursday, July 1, 2010
Subscribe to:
Posts (Atom)


