Friday, June 12, 2009

చావు బతుకులలో మొద్దు శ్రీను హంతకుడు

[మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడు ఓంప్రకాష్ రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమ శ్వాస పై ఉన్నాడు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొద్దుశ్రీను హత్యజరిగినప్పుడు, ఈ ఓంప్రకాష్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా “అందరు తనగురించి చెప్పుకుంటారని, అందుకోసం తానే మొద్దుశ్రీనును హత్య చేసానని” చెప్పుకున్నాడు. అప్పుడు ఈ నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో తాను ‘పైపైకి’ పోతాను అనుకున్నాడు. ఇప్పుడు ఇలా చావుబ్రతుకులలో ఉన్నాడు.

సుబ్బారావు:
అంతే మరదలా! వెనుక రాజకీయ హస్తం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, రోగాలు వస్తాయి, చస్తారు కూడా! అలాగే ఓంప్రకాష్ కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోగం వచ్చి, రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమశ్వాసతో ఉన్నాడు. ఇప్పుడు కూడా పైకే పోతాడు.
*********

No comments:

Post a Comment