Friday, August 28, 2009

ధరలు ఎప్పుడు తగ్గుతాయి?

[నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వార్తల నేపధ్యంలో………]

సుబ్బలష్షిమి:
బావా! ఈ నిత్యావసర సరుకుల ధరలు ఇంకెప్పటికీ దిగిరావా? ధరలు తగ్గనే తగ్గవా?

సుబ్బారావు:
ఎందుకు తగ్గవు మరదలా? తప్పకుండా తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆర్ధికమాంద్యం తొలగిపోయి, మళ్ళీ మన రాజకీయనాయకులకి, సెజ్ ల పేరుతో భూములమ్ముకోవడానికి కొనుగోలుదారులు వచ్చినప్పుడు, సరుకుల ధరలు తగ్గిపోతాయి. అప్పుడు రూపాయికి ఎకరం భూమి అమ్మగా చేతికొచ్చిన కోట్లాది రూపాయల లాభాన్ని చూసుకుని, జనం తినే బియ్యం, కందిపప్పు, చింతపండులని ’పోన్లే’ అని వదిలేసారు. ఇప్పుడు భూములు కొనే నాధులు లేనందున, జనం తిండిని బ్లాక్ మార్కెట్ చేయించి తము తింటున్నారు. కాబట్టి ధరలు తగ్గాలంటే ఆర్ధికమాంద్యం పోవాల్సిందే!

సుబ్బలష్షిమి:
అనకూడదు కానీ అదేదో సామెత గుర్తొస్తోంది బావా! “ఏనుగులు తినే వాడికి………….” అన్నట్లు సెజ్ లమ్ముకునే వాళ్ళకి కందిపప్పు, చింతపండులలో ఎంత మిగులుతుందని?
*********

No comments:

Post a Comment