Sunday, August 30, 2009

అగ్రనేతలు ముఖం చాటేస్తారెందుకు?

[జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీల సంక్షోభాల వార్తల నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
బావా! నేను గమనించానూ, కాంగ్రెస్ లో ఏదైనా సంక్షోభం చెలరేగినప్పుడూ, క్లిష్టపరిస్థితులు ఏర్పడినప్పుడూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసలు మీడియా కవరేజ్ లోకి రాదు. అలాగే భాజపా లోనూ…. జస్వంత్ సింగ్ పుస్తకం వివాదం కానివ్వు, అరుణ్ శౌరీ వ్యాఖ్యలు కానివ్వు, ఏ సంక్షోభం చెలరేగినా, క్లిష్టపరిస్థితులు ఏర్పడినా భాజపా అధినేత అద్వానీ కూడా మీడియా కవరేజ్ లోకి రాకుండా జాగ్రత్తపడతారు. ఎందుకలా అగ్రనేతలు ముఖం చాటేస్తారు బావా?

సుబ్బారావు:
భలే సందేహం వచ్చింది మరదలా నీకు? అలాంటి క్లిష్టపరిస్థితుల్లో అగ్రనేతలు కెమెరా ముందుకొస్తే ఇమేజ్ పోతుంది. అంతేకాదు, ఆ కష్టాల్లో…. ఆందోళనతో కూడిన ముఖం, కళ్ళు, ముఖ కవళికలు ప్రజల కంటపడితే, ప్రజలు కూడా ’ఓస్! మనలాగే వీళ్ళూ బెంగపడతారన్న మాట’. అనుకోరూ? అందుకే అలాంటి సమయాల్లో ‘Avoidance is the best policy’ అనుకుంటారన్న మాట.

సుబ్బలష్షిమి:
అంటే ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అనుకోవాలన్న మాట.

****************

No comments:

Post a Comment