Wednesday, September 2, 2009

హారతి గైకొనవో జస్వంత్ సింగ్ - పాకిస్తాన్

[పాకిస్తాన్ పత్రికలు జస్వంత్ సింగ్ ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయని, పాక్ ప్రజలు అతడి పేరిట ‘ఖవ్వాలి’ వంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారనీ వార్తల నేపధ్యంలో…..]

సుబ్బలష్షిమి:
బావా! మహమ్మద్ ఆలీ జిన్నాని పొగుడుతూ, నెహ్రూ,పటేల్ లని దేశవిభజనకి బాధ్యుల్ని చేస్తూ, జస్వంత్ సింగ్ పుస్తకం వ్రాసినందుకు పాక్ పత్రికలు అతణ్ణి పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నాయట. పాక్ ప్రజలు తమ జాతిపితని పొగిడిన జస్వంత్ సింగ్ ని పొగుడుతూ, పాటలు వ్రాసి పాడుతున్నారట. విన్నావా?

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! హిందువులలో, భారతీయులలో అనైక్యతనీ, ముస్లింలలో పాకిస్తానీయులలో ఐక్యతనీ మీడియా ఏనాడో సృష్టించింది, పెంచిపోషించింది. తమ జాతిపిత పట్ల, తమ మాతృదేశం పట్ల భక్తిని పాకిస్తానీలు కలిగి ఉంటే, భారతీయులు తమ దేశాన్ని తామే ’బ్లడీ ఇండియా’ అంటారనీ, గాంధీ, నెహ్రులని బూతులు తిడతారని, ఒకప్పుడు అంతర్జాతీయ మీడియా ‘డెమో’ చేసి మరీ చూపించింది. ఇప్పటికీ అలాంటి భారతీయుల్ని మన చుట్టూ ఎంతో మందిని చూస్తున్నది కూడా నిజమేకదా?

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! మొగుడు ముం…. అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముం…. అంటాడని ఊరికే అన్నారా పెద్దలు?

No comments:

Post a Comment