[ఒక్క కర్నూలు జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దు వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
మొన్న వై.యస్.రాజశేఖర్ రెడ్డి మృతిచెందినప్పుడు, నెలకి 200/-రూ. ల వృద్దాప్య పింఛను, వికలాంగ పింఛన్లు రావేమోనని, ఇందిరమ్మ ఇళ్ళూ, ఆరోగ్యశ్రీ కార్డులూ వంటి పధకాలు ఆగిపోతాయోమోనని బెంగతో గుండెలాగి అంతమంది మరణించారు కదా బావా! ఇప్పుడు ఏకంగా ఒక్క జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దయ్యాయట. ఇక రాష్ట్రమంతా అయితే, ఎన్ని లక్షల ఇళ్ళో? మరి ఇప్పుడు ఎంతమంది గుండెలాగి పోతాయో బావా?
సుబ్బారావు:
అప్పుడంటే మీడియాకి అవసరం కాబట్టి, రాష్ట్రంలో, ఎందుకైనా మరణించనీ, మరణించిన వారంతా వై.యస్.అభిమానులైపోయారు, మరణాలన్నీ బెంగతో గుండెలాగి పోయినవై పోయాయి గానీ, ఇప్పుడలా కాదు గదా మరదలా?
సుబ్బలష్షిమి:
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుందే తప్ప, ఎందులోనూ నిజం లేనట్లుంది బావా!
Tuesday, September 22, 2009
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment