Saturday, September 12, 2009

దేశాన్ని ఎవరు అమ్మగలరు? కే.కే. చెప్పాడు!

“123 మంది, 133 మంది వంటి సంఖ్యలతో అధిష్టాటాన్ని పోల్చుకోకూడదు. సోనియా నిర్ణయం కంటే 122 మంది శాసనసభ్యుల మద్దతు ఎక్కువా?” – కె.కేశవరావు .

“మెజారిటీ ఉందని ‘దేశాన్ని అమ్మేద్దాం’ అని తీర్మానం చేసి దేశాన్ని అమ్మేద్దామా?” అని పి.సి.సి. మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు – వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
ఈ కాకాలు, కే.కే.లు గట్రాల ప్రకటనలు చూస్తే జుగుప్స కలుగుతోంది బావా!

సుబ్బారావు:
జుగుప్స సంగతి పక్కన బెట్టు మరదలా! ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పీ.లు ఎంతమంది అయినా సరే, మెజారిటీ ఉందని తీర్మానాలూ చేసి దేశాన్ని అమ్మలేరు. కానీ పార్టీ అధిష్టానం అయిన ఆ ’ఒక్కవ్యక్తి’ మాత్రం దేశాన్ని అమ్మేయ వచ్చని, అమ్మేయగలదని చెప్పకనే చెప్పాడు కదా కే.కేశవరావు?

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

No comments:

Post a Comment