Wednesday, October 7, 2009

క్రికెట్టే ముద్దు – వార్తలు వద్దు

[భారతదేశంలో 13 కోట్ల టీవీ సెట్లూ, దాదాపు 65 కోట్ల టీవీ పేక్షకులూ ఉన్నారు. 8.5 కోట్ల కేబుల్ కనెక్షన్లూ, 2 కోట్ల డిటిహెచ్ సెట్ లూ ఉన్నాయి. దాదాపు 10 కోట్లకు పైగా కేవలం దూరదర్శన్ ని చూసే ప్రేక్షకులు ఉన్నారు. అయితే, వార్తలు కూడా వదిలేసి డిడి కేవలం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలకే పరిమితమైపోయిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వరద వార్తలూ, ప్రజల ఆర్తనాదాలు కూడా వదిలేసి, ఈ డిడి వాళ్ళేమిటి బావా, [దాదాపు] కేవలం క్రికెట్ ప్రత్యక్షప్రసారాలే పనిగా పెట్టుకున్నారు? కనీసం విరామంలో నన్నా వార్తాలు ప్రసారం చేస్తారేమోనని చూశా! అప్పుడూ క్రికెట్ గురించి, ఆటగాళ్ళ గురించీ….. సమీక్షలూ, భుజాలెగరేస్తూ నవ్వులూ, వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. ఇదేం విపరీతం బావా? వాళ్ళకు వాణిజ్యప్రకటనల డబ్బులే తప్ప ఇంకేం పట్టవా?

సుబ్బారావు:
వాణిజ్యప్రకటనల డబ్బులన్న మాట పైకి మరదలా! వార్తలు చూపిస్తే ప్రజలకి నిజాలు, పరిస్థితులు అర్ధమైపోతాయేమోననీ, ప్రభుత్వాలపట్ల వ్యతిరేకత పెరుగుతుందేమోనని ప్రభుత్వాలకి భయమై ఉంటుంది. ఎటూ ప్రైవేటు టీవీ ఛానెళ్ళు అబద్దాల ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ టీవీ ఛానెలు డిడి, నిజాలు చెప్పే పనిలేకుండా వార్తలు ఎత్తేసుకుంటోంది.

సుబ్బలష్షిమి:
అందుకా, భారత్ ఆడని క్రికెట్ మ్యాచ్ లని కూడా ప్రత్యక్షప్రసారం చేస్తోన్నారు? బహుశః డిడి అబద్దాలు ప్రచారిస్తే శాఖాపరమైన విచారణలు గట్రాగట్రా వస్తాయి కాబట్టి, ఏకంగా వార్తప్రసారాలే ఎత్తేస్తున్నారన్న మాట!

No comments:

Post a Comment