Friday, October 16, 2009

మంది ఎక్కువైతే మజ్జిగ చిక్కబడుతుందా?

[దేశంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ టీవీ ఛానెల్సూ, FM రేడియోలు రానున్నాయనీ, అందుకు ప్రభుత్వం పెద్దఎత్తున సహకరించనున్నదనీ కేంద్రమంత్రి అంబికాసోనీ ప్రకటన. అదే ఒరవడిలో ఊపందుకున్న ప్రైవేటు టీవీ ఛానెళ్ళ ప్రారంభాలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఇప్పటికే టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోయి, పోటీ పెరిగి పోయి, డబ్బులు రావటం లేదనీ, అంచేత కొన్ని టీవీల వాళ్ళు వరద బాధితుల కోసం అంటూ విరాళాలు పోగుచేసి వాటితో తమ అప్పులు తీర్చుకుంటున్నారనీ ఓ మాట బయటకి వచ్చింది. ఇలా టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోవటంతో పాతుకుపోయిన పత్రికాధిపతులు కూడా పోటీ నెదుర్కోలేక కుదేలవుతున్నారన్న మాట ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. మరి ఏం బావుకుందామని పొలోమంటూ ఇన్ని కొత్త టీవీ ఛానెళ్ళు వస్తున్నాయి?

సుబ్బారావు:
బహుశః ప్రజలందరు తమ ఛానెళ్ళ అబద్దాలను నమ్మటం లేదు కాబట్టి ‘సంఖ్య’ని పెంచుకుంటూ ఉండవచ్చు, లేదా రానున్న రోజులన్నీ సంచనాలేనని వాళ్ళ సిక్స్ సెన్సో లేక కర్ణపిశాచో చెప్పి ఉంటుంది మరదలా! లేకపోతే మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడుతుందని వాళ్ళకి మాత్రం తెలియదా?

1 comment:

  1. ఆర్థిక సంక్షోభం వల్ల కొన్ని చానెల్స్ మూతపడ్డాయని కూడా వాళ్ళకి తెలుసు అనుకుంటాను.

    ReplyDelete