Tuesday, January 4, 2011

ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు!

[బోఫోర్సు వ్యవహారంలో ఖత్రోచి, విన్ చద్దాలకు 41 కోట్ల రూపాయలు చెల్లించిన సర్కార్ – వెల్లడించిన ఆదాయపన్ను ట్రిబ్యునల్,

మద్దెల చెర్వు సూరి హత్య – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇప్పటికే స్పెక్ట్రం సెగలతో సహా పలు స్కాంలలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ + యూపీఏ ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ బోఫోర్సు తలనొప్పి తాజాగా పట్టుకొందట. ఖత్రోచి, విన్ చద్దాలకి 41 కోట్ల రూ.లు చెల్లించారనీ, ఆ మేరకు వారిద్దరూ భారత్ లో పన్ను చెల్లించాల్సిందేననీ… ఆదాయ పన్ను ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

ఆ వార్తని ‘ఈనాడు’ ఎక్కడో 11 పేజీలో చిన్న అక్షరాల శీర్షికలో ఓ 3 కాలమ్ వార్త వేసి అయ్యిందని పించేందేం బావా! ఒకప్పుడైతే పేజీలన్నీ భోపోర్సు తోనే నింపేది కదా?

అందునా బోఫోర్సు వ్యవహారంలో ఎవరికీ ఎటువంటి కమీషన్లు అందలేదని సీబీఐ తన దర్యాప్తులో తేల్చగా, దానికి విరుద్దంగా ఐటీ ట్రిబ్యూనల్ తీర్పు వెలువరించిన సందర్భంలో, ‘ఈనాడు’కి అది అంత అప్రాధాన్య వార్త ఎలా అయ్యింది?

సుబ్బారావు:
అప్పటిది రాజీవ్ గాంధీ హయాం, ఇప్పటికి సోనియా హయాం! తేడా లేదా మరదలా!? ఈనాడు రామోజీరావు… ఇందిరా, రాజీవ్ కీ, కాంగ్రెస్ కీ వ్యతిరేకి! సోనియాకైతే పరమ రక్షకుడు!

కాబట్టే - రాజీవ్ ని ఇరుకున బెట్టేందుకు పేజీలన్నీ బోఫోర్సు ఆక్రమాల గురించే నింపి పారేసేవాడు. ఇప్పుడు సోనియాని రక్షించేందుకు, శాయశక్తులా పాటుపడుతున్నాడు.

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ఈ మద్దెల చెర్వు సూరి Vs పరిటాల రవి ల వ్యవహారాల్లో కూడా ‘ఈనాడు’ కవరేజీ అలాగే ఉంది! అసలు ఈనాడు అంత ఎక్కువగా స్పందిస్తుందేమిటి? వాళ్ళేదో మహాత్ములో, ప్రపంచ నాయకులో అన్నట్లు… పరిటాల రవి హత్య జరిగాక, కొన్ని రోజుల పాటు, ప్రతీ రోజూ ఈటీవీ కి అదే ప్రధాన వార్త అయ్యింది. దాదాపు సంవత్సరం పాటు పదే పదే రవి హత్యా దృశ్యాల్ని, ఈగలు మూగిన అతడి రక్తసిక్త దేహాన్నీ చూపింది.

ఇప్పుడు సూరి కాల్చివేత కీ అంతే ప్రాధాన్యత! తొలిపేజీ తొలివార్త. 2వ పేజీలో దాదాపు సగం కవరేజీ! 6వ పేజీ పూర్తిగా అదే! 13 వ పేజీలో బాక్సు వార్తలు!

వాళ్ళు నిత్యం దందాలు, హత్యలూ చేసే నేరగాళ్ళు. అదేదో మహానాయకులన్నట్లు ఈనాడు ఎందుకంతగా అంగలారుస్తుంది?

సుబ్బారావు:
ఈనాడు రామోజీరావుకి అలాంటి దందారాయుళ్ళే ఆప్తులు మరదలా!

అయితే సూరి Vs రవిల వ్యవహారంలో మరికొంత మెలిక ఉంది. రెండు మూడునెలల క్రితం ‘ఈనాడు’ ఆదివారం సంచికలో పరిటాల రవి భార్య సునీత స్వగతం గురించి ప్రత్యేక కథనం ప్రచురించారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడూ ఈనాడు అతడికి సానుకూలంగా వ్రాసింది. అందుకే పత్రికనీ, టీవీనీ ఉపయోగించింది.

ఇప్పుడు సూరి మృతి విషయంలో… అతడి ప్రత్యర్ధుల బలానికి దన్ను ఇస్తూ అతిగా స్పందిస్తోంది.

సుబ్బలష్షిమి:
ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు బావా!

1 comment:

  1. very soon eenadu group was going in to the hands of a christian multi national.so to get maxm benifit in this deal,ramoji backng soniya ji.

    ReplyDelete