Monday, January 17, 2011

సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

[>>>పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఖత్రోచీ ఈ దేశం విడిచి విదేశాలకు పారిపోయారు. ఖత్రోచి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరి, మధ్యలో పది, జనపథ్ వద్ద కాసేపు ఆగి, లోపలికి వెళ్ళివచ్చినట్లు ఆనాడు ఆయన కారు నడిపిన డ్రైవర్ ఆ తరువాత వెల్లడించారు – ఈనాడు సంపాదకీయ పేజీలో (09 జనవరి, 2011) వీరేంద్ర కపూర్ వ్యాసం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పీవీజీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఖత్రోచీ భారత్ నుండి పారిపోతూ పదీ జనపథ్ కి వెళ్ళినప్పుడు… సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

సుబ్బారావు:
“ఈ పీవీ నరసింహారావు చూశావా, నేను ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తున్నాడు. కాస్త ఇతడి పని పట్టు!” అని ఖత్రోచీ సోనియాకి చెప్పి ఉంటాడు మరదలా! అందుకే గదా, ఈ ఇటలీ నాయకి పీవీజీని అడుగడుగునా అవమానించింది?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! 2004 లో పీవీజీ మరణించిన తక్షణమే, ఢిల్లీలోని ఆయన నివాసం భవనం నుండి, ఆయన కుమారుణ్ణి బయటికి పంపారట.

సుబ్బారావు:
పీవీజీ మరణించిన వెంటనే రూల్స్ ప్రకారం ఆయన నివాస భవనాన్ని స్వాధీనం చేసుకొని ఉంటారు, మరదలా!

సుబ్బలష్షిమి:
మరి అదే అయితే… జగ్ జీవన్ రామ్ నివాస భవనమైతే అతడు మరణించినప్పుటి నుండి అతడి కుమార్తె మీరా కుమార్ అధీనంలోనే ఉంది, స్పీకర్ గా ఆమెకి కేటాయించిన భవనానికి ఇది అదనమని, ఇదే వీరేంద్ర కపూర్ మొన్నటి ‘ఈనాడు’ సంపాదకీయం పేజీలో వ్రాసాడు తెలుసా!

సుబ్బారావు:
మరి!? పీవీజీ బ్రతికినంత కాలం కాంగ్రెస్ కండువా మార్చలేదు. జగ్ జీవన్ రామ్ జనతా పార్టీ గట్రాలకి వెళ్ళొచ్చిన వాడు. తేడా లేదూ! అందుకే ప్రజాస్వామ్యంలో చట్టాలున్నది అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా ఉపయోగించు కోవటానికే!

No comments:

Post a Comment