Friday, January 21, 2011

ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

[10 లక్షల కోట్ల రూపాయల దోపిడి చేసిన కాంగ్రెస్ నాయకులు, అవినీతి పరులకు బుద్ది చెప్పాలి – చంద్రబాబు నాయుడి పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు
>>>ఇటీవల కొందరు నాయకులు రూ. వేలు లక్షల కోట్లు సంపాదించారు. ఆ అవినీతి, అక్రమ సొమ్మును నల్ల ధనాన్ని కొంత విదేశాల్లో దాచారు. కొంత డబ్బును ఇక్కడ వైట్ మనీగా మార్చేసుకున్నారు. చివరకు నీతి, నిజాయితీ ఉన్నవారు చేతకాని వారుగా, అవినీతి అక్రమాలకు పాల్పడే వారు తెలివైన వారుగా చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. సమాజం స్పందించాలి. అవినీతి పరులకు బుద్ది చెప్పాలి

అంటూ, తెగ ఆక్రోశ పడిపోతున్నాడు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అందునా మామ ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంలో!

ఇప్పుడు ఇన్ని నీతులు చెబుతున్న ఈ చంద్రబాబే కదా బావా, అప్పట్లో ‘వెన్నుపోటు పొడవటం, నమ్మక ద్రోహం చేయటమే… తెలివిగా, నీతి నిజాయితీ అనటం… తెలివితక్కువగా’ చలామణి చేస్తూ, మామని ఇంటికి పంపించి, తాను సీఎం సీటు ఎక్కేసాడు? అంతేకాదు, మామ స్థాపించిన పార్టీని కూడా ‘ప్రజాస్వామ్యం బద్దం’గా తానే స్వంతం చేసుకున్నాడు!?

సుబ్బారావు:
అంతే మరదలా! ‘తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అంటాడీ మాజీ ముఖ్యమంత్రి. వ్యాపారాల పేరుతో, రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని సంపాదించడంలో చంద్రబాబు, వై.యస్.ల కుటుంబీకులతో సహా… ఎవరూ, ఎవరికీ తీసిపోరు.

కాకపోతే… పదవిలో ఉన్నప్పుడు అప్పటి మాటలు, లేనప్పుడు ఇప్పటి మాటలు… మాట్లాడతారు. అంతే!

సుబ్బలష్షిమి:
మొత్తంగా ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

No comments:

Post a Comment