Tuesday, January 18, 2011

ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

[స్పెక్ట్రం అక్రమాల విషయమై కాగ్ నివేదిక తప్పుల తడక – కపిల్ సిబాల్, వార్త దాని మీద ‘ఈనాడు’ కార్టూన్ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్పెక్ట్రం అవకతవకలపైన కాగ్ నివేదిక తప్పుల తడకని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ అన్నాడు. దాన్ని కాంగ్రెస్సూ, కేంద్ర ప్రభుత్వమూ సమర్ధించుకుంది. సదరు వార్తల్ని ‘ఈనాడు’ ఓ చిన్న మల్టిబాక్స్ ఐటమ్ గానూ, ఓ కార్టూన్ గానూ వేసింది.

అదే ‘ఈనాడు’ రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్సు అవకతవకల గురించి కాగ్ నివేదికని ఉటంకిస్తూ… రోజుల తరబడి ప్రధాన శీర్షికలూ, సంపాదకీయాలూ, ఉప సంపాదకీయాలూ పెద్ద పెద్ద హెడ్డింగులతో పేజీల నిండా వ్రాసింది తెలుసా? కాగ్ విలువ అంత తగ్గిపోయిందా బావా?

సుబ్బారావు:
విలువలు పెరగటం, తరగటం అంటూ ఏమీ లేదు మరదలా! ‘ఈనాడు’ పత్రిక తనకి అప్పటి అవసరమై, కాగ్ ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటూ తెగ బిల్డప్ ఇస్తూ వ్రాసి పారేసింది.

ఇప్పటి అవసరాన్ని బట్టి అప్రధాన వార్తగా పక్కన పారేస్తోంది. ఎప్పటి అవసరాలు అప్పటివి!

సుబ్బలష్షిమి:
ఈపాటి దానికి ‘ఈనాడు’ అప్పట్లో తెగ పత్రికా విలువలు చెప్పింది మరి!?

సుబ్బారావు:
అదే మరి ఈనాడు మార్క్ జర్నలిజం! ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

No comments:

Post a Comment