Wednesday, February 2, 2011

దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది!

[పాపపు సొమ్ము కోసం పరుగులొద్దు – దేశ ప్రజలకు సోనియా పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! న్యూఢిల్లీలో నిన్న(ఫిబ్రవరి 01, 2011) చౌదరి రణభీర్ సింగ్ స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరిస్తూ, కాంగ్రెస్ అధిష్టానం సోనియా…

అధికారం, పాపపు సొమ్ముకోసం సాగుతున్న పరుగు పందెం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పరుగు పందెం ఒక పరిధి దాటితే కేవలం దురాశగానే మిగిలి పోతుందని హెచ్చరించింది.

ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగులెడుతున్నారు అని వ్యాఖ్యానించింది, తెలుసా!

సుబ్బారావు:
భేష్ మరదలా! ఓ ప్రక్క ప్రజలు ఉల్లిపాయలు కొనలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. పప్పూ బియ్యం కొనలేక చతికిల బడుతున్నారు. పిల్లల్ని చదివించుకోలేక బావురు మంటున్నారు.

ఈవిడ గారికేమో…ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగు లెడుతున్నట్లు కనబడుతోంది.

సుబ్బలష్షిమి:
బహుశః తనూ, తన బృందం చేస్తున్న పనులని ప్రజలకి అనువర్తిస్తోంది కాబోలు బావా! దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది కదూ!

2 comments:

  1. పచ్చ కామెర్ల సామెత అమ్మగారికి తెలిసినట్లు లేదు.

    ReplyDelete
  2. కృష్ణ గారు: ఇటలీలో తత్సమాన సామెత లేదేమో!:)

    ReplyDelete