Wednesday, February 9, 2011

వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట!

[గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, కాంగ్రెస్, వై.ఎస్.జగన్, సోనియా, చిరంజీవి, ప్రధాన మంత్రి లపై విమర్శలు చేసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… కాంగ్రెస్ నీ, అందులో విలీనమైన చిరంజీవినీ విమర్శిస్తూ… ‘ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు’ పెట్టారని విమర్శించాడు, బాగానే ఉంది.

అయితే అదే సందర్భంలో…

>>>రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టి రూ.1200 కోట్లతో సాక్షి పత్రికను నడుపుతున్నారు. ఇండియా సిమెంట్ షేర్ రూ.100 ఉంటే, వీళ్ళ షేర్ మాత్రం రూ.1450 పలుకుతోంది. వీటిపై ప్రధాని ప్రేక్షక పాత్ర వహించటం దురదృష్టకరం.

అన్నాడు చూశావా?

జగన్ కంపెనీ షేర్ల ధరేం ఖర్మ, చంద్రబాబు కి గాడ్ ఫాదరూ, కింగ్ మేకరూ, మార్గదర్శీ అయిన రామోజీరావు షేరు కూడా… కంఫానీ నిధుల పుణ్యమాని, ఒక్కొటి 5 లక్షల పైచిలుకు పలికింది కదా! అప్పుడూ ప్రధాని ప్రేక్షక పాత్రే వహించాడు కదా! ఆ విషయం మాట్లాడడేం ఇతడు? ఇలాంటి అవినీతిపరులకు, అన్ని అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగంలోని లొసుగుల గురించీ మాట్లాడడు.

సుబ్బారావు:
అబ్బా! ఎక్కడైనా బావా గానీ, వంగతోట దగ్గర మాత్రం కాదన్నాడట! అదే ఇతడి తీరు కూడా! రామోజీరావు కంపానీ కంపుల వంటివి మాట్లాడితే, తన లెక్కల తొక్కలూ బయటికి వస్తాయి మరి! అందుకే…ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చుకుంటూ, ఉనికి కాపాడుకుంటూ, బ్రతకాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట! ఆ కోవకే చెందుతాయి, అవినీతి గురించి మాట్లాడుతున్న సోనియా సుపుత్రుడు రాహుల్ రాజకీయాలు కూడా!

No comments:

Post a Comment