Friday, October 9, 2009

హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరు వస్తాయా?

[వరదప్రాంతాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ కుర్చీవ్యక్తి సోనియాగాంధీల ఏరియల్ సర్వే – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనెప్పుడూ గమనిస్తుంటాను, వరదలూ, తుఫానులూ వచ్చినప్పుడు, రాష్ట్రప్రభుత్వాలేమో వేలకోట్లు సాయమడుగుతాయి. కేంద్రమేమో అందులో ఐదోవంతో, పదో వంతో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఎందుకలా?

సుబ్బారావు:
అంతే మదరలా! అదే కార్పోరేటు కంపెనీలు నష్టాల బారిన పడితే ప్యాకేజీలు ఉదారంగా ఇచ్చేస్తారు. మరి వాళ్ళు తమ అనుంగు సన్నిహితులయ్యె! అదీగాక ఆకాశంలో నుండి వరద ప్రాంతాలని దర్శిస్తే ఏం తెలుస్తుంది? వరద బురదలో నడుస్తూ, దుర్గంధం ఎలా ఉంటుందో చూస్తే, బాధితుల గోడు వింటే ప్రజల కష్టాలేమిటో తెలుస్తాయి గానీ! హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరూ రావు కదా?

2 comments:

  1. అంతే కదా మరి, మన కాలు నేల మీద ఉంటే కదా నేల తడి తెలిసేది.

    ReplyDelete
  2. baaga raasaru andi..

    mushti 1000 crores iccharu.. 34 mandi MP lu vunnaru govtment lo. kaneesam jaatiya vipattuga anounce cheyyaledu

    ReplyDelete