Wednesday, January 5, 2011

అవసరాలు ఎంత వేగంగా మారితే, రాజకీయ వ్యూహాలు అంత వేగంగా మారతాయి!

[పీఏసీ ముందు ప్రధాని హాజరు కావాల్సిన అవసరం లేదు – ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్ప్రెక్ట్రమ్ ఆక్రమాల గురించి పీఏసీ ఎదుట హాజరౌతానంటూ ప్రధాని లేఖ వ్రాయటం గొప్ప విషయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఆ రోజే ప్రకటించారు కదా? పార్టీ అభిప్రాయాన్నే కదా అధికార ప్రతినిధులు ప్రకటిస్తారు?

మరి ఇప్పుడేమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘నెంబర్ టూ’గా, ‘ట్రబుల్ షూటర్’గా పిలవబడే ప్రణబ్ ముఖర్జీ, ‘ప్రధాని పీఏసీ ముందు హాజరౌతాననటం సరికాదు. పార్టీతో చర్చించకుండానే మన్మోహన్ నిర్ణయం తీసుకున్నాడు’ అంటున్నాడు? ‘తనని అడిగి ఉంటే వద్దని చెప్పే ఉండేవాణ్ణి’ అని కూడా అన్నాడు తెలుసా?

సుబ్బారావు:
అవసరాన్ని బట్టి మాట మార్చడం ఇప్పటి కాంగ్రెస్ అధినాయకురాలికీ, అగ్ర నాయకులకీ అలవాటే మరదలా! కాకపోతే, ఆయా అవసరాలు మరీ తొందరగా మారిపోతున్నట్లున్నాయి. అందుకే వ్యూహాలూ ప్రకటనలూ కూడా త్వరగా త్వరగా మారిపోతున్నాయి.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు ఎంత వేగంగా మారితే రాజకీయ ఊసరవెల్లులూ, అంతే వేగంగా రంగులు మారుస్తాయి. అప్పుడు కదా ప్రజలకి బాగా అర్ధమయ్యేది!
~~~~~~~

1 comment:

  1. 'gopi'-నా పక్కుంటే భయమ౦టు ఎందుకంటా?

    ReplyDelete