Wednesday, November 11, 2009

జిజియా పన్నులాంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి!

[ప్రపంచబ్యాంకు నిర్దేశాలననుసరించి చిరువ్యాపారుల మీద కత్తి ఝుళిపించనున్న కేంద్రప్రభుత్వం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ దారుణం చదివావా బావా? పుట్ పాత్ ల మీద బ్రతికే బడుగు జీవుల చిరువ్యాపారులను కట్టడి చేయనుంది కేంద్రప్రభుత్వం! ఇలా పేదసాదల కడుపులు కొడితేనే కదా కార్పోరేట్ వ్యాపారాలు ఇబ్బడిముబ్బడి అయ్యేది?

సుబ్బారావు:
అప్పుడే ఏం చూశావు మరదలా? ఇంకొన్నిరోజులు పోతే సామాన్యులు ఊపిరి పీల్చినందుకు కూడా పైసలు కట్టాల్సిందే అంటుంది కేంద్రప్రభుత్వం.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! జిజియా పన్ను విధించిన ఔరంగజేబు మంచి వాడు అన్పించాలంటే, వీళ్ళు ఇలాంటిపన్నులే విధించాలి మరి!

1 comment:

  1. విమాన ఇంధనం లాంటి ఖరీదైన వాటి మీద టాక్స్ తగ్గించేసి చిల్లర వ్యాపారాల పై టాక్స్ పెంచడం వల్ల మన ప్రభుత్వం కార్పరేట్ల పక్షం అని అర్థమవుతోంది.

    ReplyDelete