Sunday, November 22, 2009

కోర్టుల్లో కిలోల లెక్కన న్యాయం దొరుకుతోంది!

[‘ఉత్తరాదీయులపై దాడి కేసులో రాజ్ థాకరే మీద చార్జిషీటు’ శీర్షీక, ఈనాడు, తేదీ: సెప్టెంబరు 19, 2009; పేజీ.నెం.05 – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత ఏడాది, ఎం.ఎన్.ఎన్. కార్యకర్తలు, రైల్వే ఉద్యోగ నియామక పరీక్ష వ్రాయడానికి వచ్చిన ఉత్తరాది యువకులని చెప్పులతోనూ, చేతులతోనూ చావబాదటం అందరం టీవీ వార్తల్లో చూసిందే! ఆ కేసు, సంవత్సరం తర్వాత, నిన్న, ముంబై, బాంద్రాలోని మేజిస్ట్రేటు కోర్టులో విచారణకు వచ్చిందట. కేసుని పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై ఆరోపణల నమోదు కు వచ్చే ఏడాది సెప్టెంబరు 13 వ తేదీని నిర్ణయిస్తూ విచారణ వాయిదా వేసాడు. అంటే దాదాపు 10 నెలల తర్వాతన్న మాట. విన్నావా బావా!

సుబ్బారావు:
విన్నాను మరదలా! ఈ లెక్కన ఇక ఆ కేసులు తేలాలంటే ఎన్ని దశాబ్దాలు/శతాబ్దాలు పడతుందో! కోర్టుల్లో న్యాయం కేజీల లెక్కన దొరుకుతున్నట్లుంది కదా, మరదలా!

No comments:

Post a Comment