Thursday, November 12, 2009

ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు!

[’ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఆ రీత్యా గ్రేటర్ టిక్కెట్లకు రద్దీ పెరిగింది. దానిపై ఆరోపణలు రావడం సహజమే’ – అన్న ముఖ్యమంత్రి రోశయ్య, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగి, ప్రజాసేవ చేయటం కోసం తోసుకు తోసుకు వస్తున్నారటగా బావా?

సుబ్బారావు:
అలాగ్గాక, కాంగ్రెస్ లో ఉంటే దోచుకు తినటానికి కావలసినన్ని దారులు ఉన్నాయనీ, అందుకే టిక్కెట్లు కోసం తోసుకు తోసుకు వస్తున్నారనీ…. నిజం చెబుతారా ఎవరైనా? మరీ నీకు లౌక్యం తెలియదు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు పెట్టడం… ఇవాళా, రేపూ రాజకీయనాయకులూ, కార్పోరేట్ దిగ్గజాలూ చేస్తూన్నదే, మనం చూస్తూన్నదే!

No comments:

Post a Comment