Saturday, November 21, 2009

తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోకుండానే…..

[తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న జగన్ పై విమర్శలు తగవు – కాంగ్రెస్ స్పోక్స్ మెన్ మనీష్ తివారీ.
తండ్రిపోయిన దుఃఖం నుండి నేనింకా తేరుకోలేదు – జగన్ , వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తండ్రిపోయిన దుఃఖంలో జగన్ ఉన్నాడని, అతడిపై అవినీతి ఆరోపణలు చేయటం తగదని మనీష్ తివారీ అంటున్నాడు. జగన్ కూడా అవునని అంటున్నాడు.

సుబ్బారావు:
తండ్రిపోయిన దుఃఖంలో నుండి తేరుకోకుండానే రాజకీయాలు చేస్తున్నాడా? పైపెచ్చు వ్యూహ ప్రతివ్యూహాలూ పన్నుతున్నాడు కదా?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా, నేనే తరవాత సి.ఎం., నేనే తరవాత సి.ఎం. అని కూడా అంటున్నాడు. బహుశః సి.ఎం. అయితేగానీ తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోడేమో బావా?

1 comment:

  1. మేము వై.ఎస్ చేతుల్లోకి 50 వేలకోట్ల ప్రజాధనం పోయిన దుఃఖంలో ఉన్నాం.

    ReplyDelete