Friday, October 1, 2010

ప్రజలేప్పుడైనా శాంతికాముకులే!

[ఎంత గొప్ప పరిణితి! సంయమనం భరత జాతికే చెల్లు. అయోధ్య తీర్పు నేపధ్యంలో అల్లర్లు జరగకుండా శాంతి పాటించిన ప్రజలని అభినందిస్తున్న ఈనాడువార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న అయోధ్య తీర్పు వెలువడిన నేపధ్యంలో... ప్రజలంతా శాంతి సామరస్యాలతో, సంయమనం పాటించారు. అదే 1989లో శిలాన్యాస్, 1992లో కరసేవల నేపధ్యంలో... మతఘర్షణలు, రక్తధారలూ చోటు చేసుకున్నాయి. తేడా ఎక్కడుంది బావా?

సుబ్బారావు:
అద్వానీలు, అశోక్ సింఘాల్‌లు, ఇమాం బుఖారీలు, ఓవైసీలు, బిన్ లాడెన్‌లూ రెచ్చగొట్టక పోతే ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతి కాముకులే మరదలా!

సుబ్బలష్షిమి:
వెరసి... ప్రజలు మంచివాళ్ళే బావా! నాయకులే పుచ్చుబద్దలు!

No comments:

Post a Comment