Tuesday, October 19, 2010

చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను, నువ్వయ్యన్నీ నమ్మకూడదు!

[ఆరువేల కోట్లతో బీహార్ ముఖచిత్రమే మార్చేయవచ్చు - ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో, ప్రధాని మన్మోహన్ సింగ్... నితీష్ కుమార్ ని విమర్శిస్తూ ‘బీహార్ కి ఆరువేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఇచ్చామనీ, వాటికిప్పుడు రాష్ట్రప్రభుత్వం లెక్కలు కూడా చెప్పటం లేదనీ, ఆ ఆరువేల కోట్లతో రాష్ట్ర ముఖచిత్రమే మార్చేయవచ్చని వ్యాఖ్యానించాడు తెలుసా?

సుబ్బారావు:
అలాగైతే... తామే వెనకేసుకొచ్చిన రాజా, స్పెక్ట్రమ్ నిర్వాకంలో 60 వేల కోట్ల రూపాయలతో, వై.యస్. అక్రమార్జన 70వేల కోట్ల పై చిలుకుతో కలిపి, మొత్తం భారతదేశపు ముఖచిత్రమే కాదు, పక్కనున్న పాకిస్తాన్ ముఖచిత్రం కూడా మార్చేయవచ్చు. ఇక స్విస్ లో ఉన్న భారతీయుల నల్ల ధనంతో... సగం భూగోళపు ముఖచిత్రం మార్చేయవచ్చు. ప్రయత్నిస్తే పోలా... ఈ ప్రధానమంత్రీ, ఆ యూపీఏ కుర్చీ వ్యక్తీ?

సుబ్బలష్షిమి:
"చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను. నువ్వయ్యన్నీ నమ్మకూడదు" అంటాడు... గోలీమార్ సినిమాలో హీరో! అట్లాగే... ఎన్నికలప్పుడు రాజకీయ నేతలు లక్ష చెబుతారు, జనమయ్యన్నీ నమ్మకూడదు, మరదలా!

2 comments:

  1. బాగా వ్రాశారు.

    నా ఈ సరదా టపా చదివారా?

    http://kyamedidotcom.blogspot.com/2010/10/blog-post_17.html

    ReplyDelete