Friday, October 8, 2010

రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో!

[క్షేత్రస్థాయిలో నేతలూ పనిచేయాలి - పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు - సాక్షి పత్రిక వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, నేతలు క్షేత్ర స్థాయిలో పనిచేయాలంటూ ఓ ప్రక్క చంద్రబాబు ఉపన్యాసం ఇస్తుండగా, మరో ప్రక్క ఆ పార్టీ నేతలు కునికి పాట్లు(శుభ్రంగా నిద్రపోతున్నారు) పడుతున్నారు తెలుసా? ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా, ఈ రాజకీయ నాయకులు చట్టసభల్లోనూ నిద్రపోతారు, పార్టీ సభల్లోనూ నిద్రపోతారేం బావా!? రాత్రిపూట నిద్రలు పోరా?

సుబ్బారావు:
రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో మరదలా! అందుకే పగలు, "ఆఁ ఈ సొల్లు దేముంది లెద్దూ" అనుకొని సభల్లో నిద్రపోతుంటారు.

No comments:

Post a Comment