Tuesday, April 21, 2009

మీడియా మాయా జాలమా, రాజకీయ నాటకమా?

[అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ – ప్రధాని వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? ఎన్నికల తర్వాత, అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ చేస్తాడట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. పోయినేడాది జూలైలో, విశ్వాసపరీక్షకు ముందు వెనుక రోజుల్లో, రోజుకో దూషణ చేసాడు కదా, ‘లెప్ట్ పార్టీవాళ్ళు తనని హీనంగా చూశారని, ప్రతీరోజూ అవమానాలు సహించాననీ’ అన్నాడు. పోతే పోండని తరిమేసాడు. మళ్ళా ఈ రోజు ఇదేమిటి?

సుబ్బారావు:
అలా కాదు మరదలా! ముందు సిగ్నల్ ఇస్తున్నాడన్న మాట. దానిమీద లెప్ట్ వాళ్ళు వెక్కిరింతగా మాట్లాడరనుకో. వెంటనే మీడియా వక్రీకరించింది అంటే సరిపోతుంది.

సుబ్బలష్షిమి:
అయితే, ఇది మీడియా మాయాజాలం అనుకోవాలా, రాజకీయ మతలబు అనుకోవాలా?

No comments:

Post a Comment