Monday, October 4, 2010

‘దొందూ దొందే!’ మరి

[త్యాగంలో సోనియాకు జగన్ తీసిపోరు: గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు - సాక్షి, 04 అక్టోబరు, 2010, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం xyz సార్లు వచ్చినా... సోనియా త్యాగం చేసిందట. అలాగే వై.యస్.మరణించినప్పుడు 156 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉన్నా... జగన్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశాడట. అందుచేత, త్యాగంలో... సోనియాకి జగన్ తీసిపోడట. ఇలాగని ఓ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ చోట నేత అన్నాడు, జగన్ తన పేపర్‌లో ప్రచురించుకున్నాడు! చూశావా బావా?

సుబ్బారావు:
అందుకే గదా మరదలా, ‘దొందూ దొందే!’ అనే పెద్దల నానుడి గుర్తుతెచ్చుకునేది?

సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ త్యాగ ధనులందరినీ భారత ప్రజలు ఎప్పుడు త్యాగం చేస్తారో కదా బావా!

సుబ్బారావు:
కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్లు, దేనికైనా తగిన సమయం రావాల్సిందే గదా మరదలా!

~~~~~~

దొందూ దొందే కథ నేపధ్యం:

అనగా అనగా...

ఒక ఊళ్ళో ఓ నత్తి యువకుడు ఉన్నాడు. అతడికి మాటలు సరిగా రాకపోవటం చేత, పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు, దూరాన ఉన్న గ్రామానికి పోయి, తమ పిల్లవాడి లోపం గురించి దాచిపెట్టి, పెళ్ళి సంబంధం కుదుర్చుకొచ్చారు.

పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి పల్లకీలో ఊరేగుతుండగా... చింత చెట్లు విరగ బూసి కనిపించాయి. పెళ్ళి కూతురు, పెళ్ళి కుమారుడితో "తేతంది! తింత తెత్తు తూలంది. దెంత దాదా తూతిందో!"(ఏమండీ! చింత చెట్టు చూడండి. ఎంత బాగా పూసిందో) అందట.

దానికి పెళ్ళికుమారుడు "తూతే తాలంలో తూయాదూ మలి!"(పూచే కాలంలో పూయదూ మరి!) అన్నాడట.

అప్పటిగ్గానీ... పెళ్ళి కొడుకు బంధువులకి, తమ వాడిలాగే వధువుకూ నత్తి ఉందనీ, తమలాగే వాళ్ళూ విషయం దాచి పెళ్ళి చేసారనీ అర్ధం కాలేదు.

ఇదంతా చూస్తున్న పెళ్ళి కొచ్చిన వాళ్ళలో ఒక పెద్దాయన "ఇద్దరూ ఇద్దరే" అనటానికి బదులు "దొందూ దొందే!" అన్నాడట.
~~~~~~~~~~

3 comments:

  1. both are hilarious....!!!

    ReplyDelete
  2. inkoti vinnaaraa? chandra pm kavali chitturu tdp nethlu antunnte .....kaadu ayana cm gaane undali ani guntur tdp nayakulu antunnaru.
    inthaki meeru cheppina "dondhu-dondhe" bavundhi

    ReplyDelete
  3. అజ్ఞాత గారు, jaggampeta గారు :నెనర్లండి!

    ReplyDelete