Friday, October 22, 2010

రాజకీయ నాయకులే పరస్పర దర్పణాలు!

[పరస్పర నిందారోపణలతో చంద్రబాబు, రోశయ్యలు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రోశయ్య, చంద్రబాబులు ఒకళ్ళనొకళ్ళు విరగ విమర్సించుకుంటున్నారు చూశావా!?

చెన్నారెడ్డిని తెగ విమర్శించి, తనకి మంత్రి పదవి ఇవ్వగానే...‘చెన్నారెడ్డి జిందాబాద్’ అంటూ రోశయ్య ప్రశంసించాడనీ,
అలాగే... కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో ‘వై.యస్. ఒక చీడ పురుగు’ అంటూ తీర్మానాలు చేసి, కేంద్రానికి ఫిర్యాదు లేఖలు వ్రాసి, ఢిల్లీకి మోసాడనీ, అదే... వై.యస్. ముఖ్యమంత్రై తనకి ఆర్ధికమంత్రి పదవి ఇవ్వగానే... ‘వై.యస్. వంటి గొప్పనేత ఎవరూ లేరనీ’, తాను నడక ప్రారంభించే సరికే వై.యస్. గమ్యం చేరి ఉండేంత గొప్పనేత’ అంటూ కితాబు లిచ్చేసాడనీ.. అంతగా అవకాశ వాదమూ, స్వార్ధ పరత్వమూ మూర్తీభవించిన వాడు రోశయ్య... అని చంద్రబాబు రోశయ్యని విమర్శించాడు.

బదులుగా - చంద్రబాబు బ్రతికి చెడ్డవాడని తాను దయ దలుస్తున్నాననీ, ఇంటా బయటా కష్టాల్లో ఉండి ఏదో వాగుతున్నాడని సహిస్తున్నాననీ, చంద్రబాబులా తాను నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదనీ... రోశయ్య చంద్రబాబుని చెరిగి పారేసాడు.

మొత్తానికీ రోశయ్య, చంద్రబాబులు... పరస్పరారోపణలతో ఒకళ్ళ నైజాన్ని మరోకరు చక్కగా వెల్లడిస్తున్నారు బావా!

సుబ్బారావు:
రోశయ్య, చంద్రబాబులనేముంది మరదలా! రాజకీయనాయకులందరూ... ఒకరి నైజాన్ని మరొకరు, దర్పణంలా ప్రదర్శిస్తున్నారు. ఇంకెన్ని రాజకీయ దర్పణాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే! మన రాజకీయ నాయకుల శీలరాహిత్యం ఎంతటిదో అంధ అభిమానులు అర్ధం చేసుకోవాల్సిందే!

3 comments:

  1. టపాకాయలు సరే...మీ 'అమ్మ ఒడి' లో పోస్ట్ రాసి వారం అయ్యింది.

    ReplyDelete
  2. శ్రీరామ్ గారు: అవునండి! కొంచెం పని ఒత్తిడి అంతే!:) నెనర్లు!

    ReplyDelete