Wednesday, December 15, 2010

బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు!

[డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం – ప్రధాని మన్మోహన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొమ్మని’ ప్రధాని మన్మోహన్ సింగ్ కార్పోరేట్లకు హితవు చెప్పాడు. ‘డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం’ అని వ్యాఖ్యానించాడు కూడా! తెలుసా?

సుబ్బారావు:
ముఖేష్ అంబానీకి చట్టాలు సవరించి మరీ 30 వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చునప్పుడూ, కార్పోరేట్ దిగ్గజాలు 27 అంతస్థుల విల్లాలు నిర్మించుకుంటున్నప్పుడూ, భార్యలకు విలాసవంతమైన నౌకలూ విమానాలు గట్రా భారీ బహుమానాలు ఇచ్చుకుంటున్నప్పుడూ, తాను స్వయంగా కార్పోరేట్ కింగులకు xyz కోట్ల రూపాయల మేర పన్ను రాయితీలు కల్పించేటప్పుడూ… తెలియలేదు కాబోలు, ఈ ఆర్ధిక వేత్త కమ్ ప్రధానమంత్రి గారికి… డబ్బు ఒకే దగ్గర పోగుపడుతుందనీ, అది అనైతికమనీ!

సుబ్బలష్షిమి:
తెలియక పోదులే బావా! బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు.

No comments:

Post a Comment