Thursday, December 16, 2010

అవినీతికంటే ట్యాపింగే ముఖ్యం కాదా మరి!

[ట్యాపింగే ముఖ్యం, మంత్రాంగమంతా కార్పోరేట్లదే – అద్వానీ వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధానమంత్రికి అవినీతి కంటే ట్యాపింగే ముఖ్యమనీ, ప్రభుత్వాన్ని లాబీయిస్టులే శాసిస్తున్నారనీ అద్వానీ వ్యాఖ్యానించాడు, చూశావా?

సుబ్బారావు:
ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ట్యాపింగే ముఖ్యం మరదలా! లేకపోతే – ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో, అందులో తమ వాటా తమకి సరిగా ముట్టజెబుతున్నారో లేదో సరి చూసుకునేదెట్లా!?

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! మంత్రుల పోర్టు పోలియోలేం ఖర్మ, వ్యాపార వేత్తలు పార్టీలలో ఏ రంగు దుస్తులు ధరించాలో కూడా సలహాలు చెప్పగలిగేంతగా లాబీయిస్టులు శాసిస్తున్నారు!

సుబ్బారావు:
లాబీయిస్టులా మజాకా!?

No comments:

Post a Comment