Monday, December 27, 2010

ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

[డబ్బుతో కొవ్వెక్కిన జగన్ – ‘ఈనాడు’లో డీఎల్ రవీంద్రా రెడ్డి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు, జగన్ ల నిరహార దీక్షల నేపధ్యంలో ఈనాడులో డీఎల్ రవీంద్రా రెడ్డి, చంద్రబాబు దీక్షని సమర్ధిస్తూ,

>>>డబ్బు మదం ఎగిసి పడుతుంది. డబ్బు అనే కొవ్వు పదార్ధం నీ జీవ కణాల్లో ఉంది. ఆ కొవ్వుతో… సంపాదించిన సొమ్ముతో పత్రిక పెట్టి అడ్డగోలుగా వ్రాస్తావా? నిమ్స్ వైద్యుల పనితీరునే శంకిస్తావా? ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎంఎస్ చేసి ఐఎఎస్ అయి, 11 ఏళ్ళు ఐక్యరాజ్య సమితిలో పనిచేసి వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు అయిదుగురు నిపుణులున్నారు. కనీసం వీరి వివరణ కూడా లేకుండా చంద్రబాబు దీక్షపై ఇష్టానుసారం వ్రాస్తారా?

అంటూ మండి పడ్డాడు. నిమ్స్ వైద్యుల నిజాయితీ శంకించరాదంటు తేల్చి చెప్పాడు.
మరో వైపు అదే రోజు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ వ్యాఖ్యలు చూడు…

>>>అవినీతి ఒక సామాజిక సమస్యగా మారిన విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించదలచుకున్నట్లు సిబల్ చెప్పారు. మీడియా కూడా దీనికి అతీతం కాదని, అలాగే రాజకీయవర్గం, ఉద్యోగవర్గాలు.. ఏవీ దీనికి దూరం కాదని తెలిపారు.

రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రుల్లో ఎవరి మాట నమ్మాలి బావా?

సుబ్బారావు:
డబ్బు కొవ్వు, అధికార మదం తాలూకూ వ్యవహారాలు ప్రక్కన బెడితే… ‘ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు అవినీతి పరులే’నన్నది మన బోటి సామాన్యులకి కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే మరదలా!

ఇక ‘రాష్ట్ర, కేంద్ర మంత్రుల మాటల్లో ఎవరి మాట నమ్మాలి’ అంటావా?

పూర్వం రాజహంసలుండేవట. పాలనీ నీళ్ళనీ వేరు చేసేవట. అలాగే ప్రస్తుతం ప్రజలు కూడా నిజానిజాలని వేరు చేయగలిగితే అప్పుడు తెలియాల్సిందే!

సుబ్బలష్షిమి:
అయితే ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

No comments:

Post a Comment