Sunday, December 26, 2010

నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

[లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే పుట్టాడు జగన్ – వెంకట స్వామి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘ముఖ్యమంత్రిగా ఉండగా వై.ఎస్.ఆర్. అవినీతితో లక్ష కోట్లు సంపాదించాడనీ, తండ్రి సంపాదించిన ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే జగన్ పుట్టాడనీ’ కాంగ్రెస్ నేత వెంకట స్వామి అంటున్నాడు, విన్నావా?

సుబ్బారావు:
శుభమ్! ఆ ముసలి రాజకీయ వేత్త, ఈ కుర్ర రాజకీయ వేత్తకి మంచి దీవెనే ఇచ్చాడు మరదలా! లక్ష కోట్లు ఖర్చయ్యాకనైనా, అసలు నిజాలేమిటో బయట పడతాయి కదా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

No comments:

Post a Comment