Tuesday, January 26, 2010

రాజకీయనాయకుల సామూహిక ఏకపాత్రాభినయాలు

["బతుకమ్మలు ఆడేవాళ్ళు లెప్టిస్టులా? కేంద్రం చెప్పినా ఇప్పటి వరకూ విద్యార్ధులపై పెట్టిన కేసుల్ని ఎత్తేయలేదు. రెండుమూడువేల కేసులు పెట్టారు. విద్యార్ధులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇలాగైతే విద్యార్దులని ఖతం చేసేయండి. యూనివర్శిటీలను మూసేయండి" అంటూ కాంగ్రెస్ నేత కె.కె. ఆగ్రహం చెందారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ నేత కే.కేశవ రావు ఎవరి మీద ఆగ్రహం చూపుతున్నాడు? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా? ఓ ప్రక్క రాష్ట్రముఖ్యమంత్రి రోశయ్య తన చేతుల్లో ఏదీ లేదని, తను గుమాస్తా స్థాయి వాణ్ణనీ అంటున్నాడు. ఈ కే.కే. అధిష్టానం వద్ద తనకు చాలా పలుకుబడి ఉందంటూ, తెలంగాణా నాయకులందరిని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. అధిష్టానమేమో తనకు అన్ని తెలుసు అంటుంది. మరి విద్యార్ధులపై కేసులు ఎత్తేయమని చెప్పింది ఎవరు? చెయ్యనిది ఎవరు?

సుబ్బారావు:
అదంతే మరదలా! రెడ్ టేపిజపు విశృంఖల రూపం అది. సామూహికంగా రాజకీయనేతలందరూ ఏకపాత్రాభినయాలు చేస్తున్నారు. ఎవరి డైలాగులు వాళ్ళవి. విస్తుపోయి చూడ్డం ప్రజల వంతయ్యింది.

No comments:

Post a Comment