Monday, January 4, 2010

మొత్తానికీ సీను ఢిల్లీకి మారింది!

సుబ్బలష్షిమి:
బావా! ’మరింత మెరుగైన వైద్యం కోసం కేసీఆర్ ని ఖమ్మం ఆసుపత్రి నుండి హైదరాబాద్ నిమ్స్ కి మార్చినట్లు, నిమ్స్ నుండి ఢిల్లీ ఎయిమ్స్ కు మారిస్తే ఏమవుతుంది?’ అని డిసెంబరు 8 వ తేదీన నిన్ను అడిగాను గుర్తుందా?

సుబ్బారావు:
గుర్తుంది మరదలా! అప్పుడు ఎంచక్కా మీడియా ’ఢిల్లీకి మారిన సీను’ అని శీర్షికలు పెట్టుకోవచ్చు. విమాన యాన సంస్థలకి ఇబ్బడిముబ్బడి వ్యాపారం అని చెప్పాను. డిసెంబరు 9 వ తేదీ ఆర్ధరాత్రి కాంగ్రెస్ అధిష్టానం ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ అంటూ ప్రకటనా ఇచ్చింది. ఇప్పుడేమిటి?

సుబ్బలష్షిమి:
కారణం ఏదైతేనేం, ఇప్పుడదే అయ్యింది బావా! పోటాపోటిగా తెలంగాణా, సీమాంధ్ర నేతలు ఢిల్లీకి పోతున్నారట. శంషాబాద్ విమానాశ్రయం కిటకిటలాడుతుందట. టిక్కెట్లు దొరకని పరిస్థితి అని వార్తలొస్తున్నాయి.

సుబ్బారావు:
నిజమే సుమా! మొత్తానికి సీను ఢిల్లీకి మారింది మరదలా!

No comments:

Post a Comment