Wednesday, November 3, 2010

చరిత్రదేముంది? చించేస్తే చిరిగి పోతుంది!

[ఆదర్శ... వ్యవహారంలో ప్లాట్లు పొందిన రాజకీయులూ, వారి బంధువులూ తమ ఆదాయాన్ని పదీపాతిక వేలని చూపించారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓసారి దిగువ వార్త చదువు.

>>>ఆదర్శ్‌లో ఫ్లాట్లు పొందిన పేద నేతలు!
న్యూఢిల్లీ, నవంబరు 1: ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో కొలాబా ఒకటి. అందులోనే వెలిసింది వివాదాస్పద 'ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ' నిర్మించిన 31 అంతస్థుల భవంతి. ఒక్కోఫ్లాటు విలువ పదికోట్లకు పైనే! కానీ... ఈ ఫ్లాట్లు సొంతం చేసుకున్న నాయకులు మాత్రం మధ్య తరగతి జీవులు! వీరు తమ నెలవారీ ఆదాయం రూ.20వేలు లేదా అంతకంటే తక్కువే అని కాగితాల్లో చూపించారు.

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు తన నెలసరి ఆదాయం రూ.20వేలుగా చూపించి ఒక ఫ్లాటు పొందాడు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ కన్హయ్యలాల్ గిద్వానీ కుటుంబ సభ్యులకు ఆదర్శ్ బిల్డింగ్‌లో మూడు ఫ్లాట్లు లభించాయి. గిద్వానీ తన నెలసరి ఆదాయం రూ.30వేలుగా చూపించారు. ఆయన ఇద్దరు కుమారులు తమ ఆదాయం రూ.12,500 అని ఒకరు, రూ.11,500 అని ఒకరు పేర్కొన్నారు.


ఇక్కడ ఫ్లాట్లు పొందిన ఎన్సీపీ ఎమ్మెల్సీ జితేంద్ర అవద్ తమ ఆదాయం రూ.25వేలుగా చూపించారు. అదే పార్టీకి చెందిన ఎంపీ శ్రీనివాస్ పాటిల్ తాను నెలకు రూ.12,500 మాత్రమే సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఇది ఎంపీగా ఆయన పొందే ఫోన్ అలవెన్స్‌కంటే తక్కువే కావడం గమనార్హం.
~~~~
చూశావా బావా! ఎంత ధీమాగా... కాగితాల మీద సైతం, తమ ఆదాయాలు తగ్గించి చూపారో! కనీసం తమ టెలిఫోన్ అలవెన్సుగా ప్రభుత్వం చెల్లించేంత సొమ్ముకూడా, తమకు ఆదాయం లేదన్నంత పచ్చి అబద్దాల లెక్కలు!?

సుబ్బారావు:
కాగితాల దేముంది మరదలా! చించిస్తే చిరిగి పోతాయి. సాక్షాత్తూ చరిత్రే... చింపేస్తే చిరిగిపోతుందంటాడు బ్రహ్మానందం ‘ఆదుర్స్’సినిమాలో! నిజానికి చరిత్ర అలాగే వక్రీకరించబడింది. బహుశః ఈ రాజకీయులూ, వారి బంధుగీయులూ కూడా అలాగే అనుకుని ఉంటారు!

No comments:

Post a Comment