Tuesday, November 16, 2010

కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తోంది?

[సోనియాని విమర్శించి సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడంటూ గోవిందాచార్య వ్యాఖ్యానించాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించి, సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడట! అలాగని గోవిందాచార్య అంటున్నాడు. ఎందుకోమరి!?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ, మరో వైపు తనను తాను సన్యాసినిగా ప్రకటించుకున్న ఉమాభారతి, గతంలో తాను గోవిందాచార్యను వివాహమాడాలనుకున్నానంటూ కొన్ని లోగుట్లు బయటపెట్టింది. అలాంటి లోగుట్లు ఇతడికెన్ని ఉన్నాయో! సోనియాని సమర్ధించకపోతే... ఆమె, ఆమె వెనకనున్న ఏజన్సీ... ‘తన కన్నాలెన్ని బయట పెడతారో?’ నన్న ముందు జాగ్రత్త పడుతుండవచ్చు!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తాయి? సోనియాని విమర్శిస్తే స్థాయి తగ్గినట్లే నన్నమాట. విమర్శించకపోతే వీళ్ళ గుట్టుమట్లు ప్రజలకి ఎలా తెలుస్తాయి మరి?

No comments:

Post a Comment