Monday, November 22, 2010

ఉండవల్లి నిరూపించాడు, పొంగులేటి నిరూపిస్తాడు!

[సోనియా సీఐఏ ఏజంటని సుదర్శన్ వ్యాఖ్యకు నిరసనగా ముఖ్యమంత్రి రోశయ్య ధర్నా,
సుదర్శన్ మీద కేసు వేస్తానని పొంగులేటి సుధాకర్ హెచ్చరిక – వార్త నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్… సోనియాని సీఐఏ ఏజంటనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యలో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించినందుకు నిరసనగా, ముఖ్యమంత్రి రోశయ్య రోడ్డెక్కి ధర్నా చేశాడట, తెలుసా? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు తమవే అయిన చోట, సుదర్శన్ వ్యాఖ్యలు అసత్యాలే అయితే… కోర్టు కేసు వెయ్యడమో, పార్లమెంటు లో చర్చించి చర్యలు తీసుకోవటమో, ఇంకా మరేదైనా చర్యలు తీసుకోవటమో చెయ్యాలి గానీ… ధర్నాల డ్రామాలు వెయ్యడమేమిటి బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా!? కోర్టు కేసులో , పార్లమెంటులో చర్చలో, మరో చర్యలో తీసుకుంటే… సుదర్శన్ వ్యాఖ్యలకి ఋజువులు బయటపడ్డాయనుకో! అప్పుడెంత ప్రమాదం? అంచేత… పరోక్షంగా సుదర్శన్ వంటి వాళ్ళ నోళ్ళని మూసేసే చర్యలూ, (అంటే అందితే జుట్టూ, అందకుంటే కాళ్ళుపట్టుకోవడమన్న మాట) ప్రత్యక్షంగా విషయాన్ని ప్రక్కదారి పట్టించి సాధారణం చేసే ధర్నాల వంటి డ్రామాలూ చేస్తుంటారు, అంతే! అయినా కాంగ్రెస్ కార్యదర్శి పొంగులేటి సుధాకర్, సుదర్శన్ మీద కోర్టులో కేసు వేస్తానన్నాడులే! చూద్దాం!

సుబ్బలష్షిమి:
ఆఁ ! 2006 లో ఉండవల్లి అరుణ్ కుమార్… వారంలోగా ‘రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తా’నన్నాడు. ఇప్పటికీ వారం పూర్తి కాలేదు పాపం! ఇక ఈ పొంగులేటి సుధాకర్ ఎన్నేళ్ళు తీసుకుంటాడో సుదర్శన్ మీద కేసు వెయ్యటానికి!?

No comments:

Post a Comment