Sunday, November 7, 2010

‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

[ఒబామా సతీ సమేతంగా భారత్ పర్యటన - ముంబైలో బస చేసిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు, సతీమణి మిషెల్ సమేతంగా, భారత్ పర్యటనకు వచ్చాడు కదా! ముంబై విశ్వవిద్యాలయంలో మిషెల్, పిల్లలతో తొక్కుడు బిళ్ళా, చెమ్మా చెక్కా ఆడింది ‘రంగ్ దే బసంతి’ అంటూ నాట్యమూ చేసింది, చూశావా?

సుబ్బారావు:
అలా చేస్తున్నప్పుడు... శ్వేత సౌధానికి ‘అదెప్పుడో అన్నట్లో, విన్నట్లో’ గుర్తొచ్చి ఉండాలి, మరదలా! ఇందిరాగాంధీ... ‘భారతీయ గిరిజన మహిళలతో కలిసి నాట్యం చేసేదనీ, అది రాజకీయాధికారం నిలబెట్టుకునేందుకు, పట్టు కోసం , కేరీర్ కోసం... ఆమె చేసిన నాట్యం’ అని... అప్పట్లో ఆమెరికన్ పత్రికలూ, శ్వేత సౌధమూ, తెగ ఎగసెక్కాలు చేసాయి మరదలా!

మరి ఇప్పుడు భారత్ తో సత్సంబంధాలతో 50 వేల ఉద్యోగాలొస్తాయనో, మరొకందుకనో... అమెరికా అధ్యక్షుడు ఒబామా "నమస్తే! సాల్ ముబారక్! దీవాలీ!" గట్రా హిందీమాటలతో ఫీట్లు, మిషెల్ స్టెప్పులూ వేస్తున్నప్పుడు... అవి గతంలో ‘అన్నవో, విన్నవో’ అని శ్వేత సౌధానికి గుర్తొస్తుంది కదా మరి!?

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే బావా ‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

No comments:

Post a Comment