Monday, November 8, 2010

‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు!’

[వీహెచ్ మనవడు ఆకుల విక్రం అధినేతృత్వంలోని ఎస్‌కేఎస్ మైక్రోఋణ సంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్‌కేఎస్ మైక్రో ఋణసంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి, షేర్లు మార్కెట్ లోకి జారీ చేసిందట తెలుసా? బ్యాంకుల నుండి ఋణాలు తీసుకొని, వాటినే ప్రజలకి సూక్ష్మఋణాలుగా ఇచ్చాయట కొన్ని మైక్రోసంస్థలు. కొన్ని, ప్రజల నుండి నిధులు సమీకరించటానికి షేర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఎంత వింత బావా!?

సుబ్బారావు:
అంతే మరి మరదలా! బ్యాంకుల్లో ఉండేది ప్రజల సొమ్మే! దాన్ని తక్కువ వడ్డీకి తీసుకున్న మైక్రో సంస్థలు, ఆ సొమ్మునే అత్యంత అధిక వడ్డీకి మళ్ళీ ప్రజలకే సూక్ష్మ ఋణాలిచ్చి, నరాలు పిండి మరీ వసూలు చేసుకుంటున్నాయి. ఆపైన మళ్ళీ షేర్ మార్కెట్ లోకి అడుగుపెట్టి ఇంకా ప్రజల నుండి నిధులు సేకరించే పనిలో పడ్డారు. అదే మరి, ప్రభుత్వ అండా దండా ఉంటే... దోపిడి ఉండే తీరు!

సుబ్బలష్షిమి:
‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు’ అంటే ఇదేనన్న మాట.

No comments:

Post a Comment