Tuesday, February 17, 2009

40. కక్కుర్తి బెర్తులే కొంపముంచాయట

[ఫిబ్రవరి 13,09 న జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడటానికి కారణం రైలు పెట్టెలో దారి వెంబడి నిలువునా ఉండే రెండుబెర్తుల స్థానే కక్కుర్తితో మూడు బెర్తులు పెట్టటమే నన్న వార్తలు నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
కక్కుర్తి రైల్వేశాఖది అయితే మూల్యం ప్రయాణికులు చెల్లించుకున్నారట, విన్నావా బావా! ఈ కక్కుర్తి బెర్తుల మూలంగా ఎమర్జన్సీ డోర్ తీయటం కష్టమైందట.

సుబ్బారావు:
బెర్తులు బిగించింది రైల్వేశాఖ. నష్టపడింది ప్రజలు. ఇదంతా పట్టదు రైల్వేమంత్రి శ్రీమాన్ లాలూ గారికి. ఆయన రైల్వేని తాను ఎలా లాభాల బాట పట్టించాడో విదేశీయులకి సైతం పాఠాలు చెప్పడంలో, స్వదేశీయులకి 90,000 కోట్లు లాభాలు గురించి చెప్పడంలో మహా బిజీ మరి!

******

No comments:

Post a Comment