Monday, May 10, 2010

వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు

[ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో, గత ఏడాది యాజమాన్య కోటాలో 55% సీట్లు, ఎవరూ చేరకుండా మిగిలి పోయాయి. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజుల పధకం పుణ్యామాని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు బ్రతికేస్తున్నాయి. ప్రక్షాళనకు తరుణం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత నాలుగేళ్ళలో ఏర్పాటైన నాలుగు వందలకు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులను చెల్లించే పధకం వరంగా మారిందట. ఏ నాణ్యతా ప్రమాణాలను చూసి ప్రభుత్వం ఈ కళాశాలలను పోషిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందని పత్రిక వ్రాసింది. చూశావా?

సుబ్బారావు:
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 90%, రాజకీయ నాయకుల యాజమాన్యంలోనివే మరదలా! ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదలు ఎమ్మెల్యేల దాకా, అందరికీ విద్యావ్యాపారాలున్నాయి.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! గుట్టు చప్పుడు కాకుండానే ప్రజా ప్రతినిధుల జీతభత్యాలని పెంచుకున్నట్లే, వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు తెచ్చుకున్నారన్న మాట! ఇక ఇందులో చర్చంచడానికేముంది, దోపిడి తప్ప!?

No comments:

Post a Comment