Monday, May 10, 2010

కార్పోరేట్ వాళ్ళు తుమ్మినా దగ్గినా వార్తే మరి!

[లక్ష్మీమిట్టల్ పుత్రోత్సాహం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రవాస భారతీయుడు, కోట్లాదిపతి అయిన లక్ష్మీ నివాస్ మిట్టల్, భవిష్యత్తులో తమ కంపెనీ ‘యార్సెలర్ మిట్టల్’ పగ్గాలను, తన కుమారుడు అదిత్య మిట్టల్ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాడట. ‘ఏమైనా నిర్ణయించాల్సింది మాత్రం బోర్డే’ అని కూడా వ్యాఖ్యానించాడట. ఇదేం వార్త బావా? మన వీధి చివర చిల్లర కొట్టు సుబ్బయ్య కూడా తన వ్యాపారాన్ని కొడుక్కే అప్పగించాడు. సుబ్బయ్య తండ్రీ అంతే! అలాగే.... లక్ష్మీమిట్టల్ తన వ్యాపారాన్ని, తన కొడుక్కి అప్పగించాలనుకుంటున్నాడు. దానికే ‘లక్ష్మీ మిట్టల్ పుత్రోత్సాహం’ అంటూ కవరేజ్ ఇస్తోందేమిటి మీడియా? పోనీ మిట్టల్ తన వ్యాపారాన్ని కొడుక్కి అప్పగించిన సందర్భంలో నన్నా వ్రాస్తే అర్ధం ఉండేది. అలా ఆకాంక్షించటమే వార్త అవుతుందా?

సుబ్బారావు:
ఓసి అమాయక మరదలా! మన వీధి చివరి సుబ్బయ్య చిల్లర కొట్టు, తిప్పికొట్టినా లక్ష చెయ్యదు. లక్ష్మీ మిట్టల్ కోట్లాదిపతి మరి! కార్పోరేట్ వాళ్ళు తుమ్మినా దగ్గినా వార్తే మరి! కార్పోరేట్ లకి కవరేజ్ ఇస్తే పైసలు ముడతాయి! సుబ్బయ్యకి కవరేజ్ ఇస్తే సున్నం తప్ప రాలేదేముంది?

సుబ్బలష్షిమి:
ఔనులే బావా! కార్పోరేట్లు సుష్టుగా తింటే సామాన్యులు బ్రేవుమని త్రేన్చాలనీ, అంబానీలు విల్లాలు కడితే, ‘అబ్బా మన దేశం ఎంత అభివృద్ది అయ్యింది’ అనీ.... మామూలు జనం మురిసి పోవాలంటుంది మీడియా!

No comments:

Post a Comment