Sunday, May 23, 2010

ఆ రోజు అవినీతిలో వాటా పుచ్చుకున్న అధిష్టానం, ఈ రోజు పత్తివిత్తనమా?

[వై.యస్. కుటుంబం, మంత్రులు రాష్ట్రాన్ని దోచారు. వారి దోపిడీతోనే దుస్థితి.... తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు నాయుడు.... ఈ అక్రమాలపై తామిప్పుడు మాట్లాడటం కాదని, గతంలోనే ’రాజా ఆఫ్ కరప్షన్’ వంటి పుస్తకాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసి కెళ్ళామంటున్నాడు, చూశావా? పైగా... ఈ అవినీతిపై ఇప్పటికైనా సోనియా, మన్మోహన్ స్పందించాలని డిమాండ్ చేశాడు కూడా! అక్కడికి ఈ అవినీతి విషయంలో..... సోనియా మన్మోహన్ లు అభం శుభం తెలియని అమాయకులన్నట్లు, ఏం బిల్డప్ బావా ఇది?

సుబ్బారావు:
అదే గమ్మత్తు మరదలా! కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, కాంగ్రేసేతర భాజపా, తెదేపా గట్రా అన్ని పార్టీల వాళ్ళూ సోనియా, మన్మోహన్ లకి అవినీతిలో ‘అ ఆ’లు కూడా తెలియవన్నట్లు, వాళ్ళిద్దరూ మహా పత్తి విత్తనాలన్నట్లు మాట్లాడతారు. ఇంత అవినీతి వాళ్ళ అనుమతి లేకుండానూ, వాటాల్లేకుండానూ నడుస్తోందని నమ్మించ చూస్తారు. అంతా అంతర్గత సర్ధుబాటు మరి!

సుబ్బలష్షిమి:
నీకింకో విషయం గుర్తుందా బావా! ఇదే చంద్రబాబు నాయుడు, వై.యస్.బ్రతికి ఉన్న రోజుల్లో.... ఢిల్లీకి ప్రతీరోజూ సూట్ కేసుల కొద్దీ డబ్బు వెళ్తోందన్నారు. అప్పుడంతగా అవినీతిలో తమ వాటా తాము పుచ్చుకున్న ఢిల్లీ, హఠాత్తుగా ఇప్పుడు అమాయకం ఎలా అయిపోయిందో చంద్రబాబుకే తెలియాలి!

No comments:

Post a Comment