Monday, May 24, 2010

సోనియా తప్పుచేసినా నిలదీస్తాం!... కాస్కోమల్లా!

[సోనియా తప్పుచేసినా నిలదీస్తాం... జగన్ వర్గం ఎం.ఎల్.ఏ.లు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే ఆర్జున్ సింగ్ లాంటి సీనియర్ నాయకులు సైతం గజగజ వణికేవాళ్ళు. ఇప్పుడు జూనియర్ ఎం.ఎల్.ఏ.లు కూడా `సోనియా తప్పు చేసినా నిలదీస్తాం. పార్టీలో తమకు ఆ హక్కు ఉంది' అంటున్నారు! పార్టీలో అంతగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందా బావా?

సుబ్బారావు:
ప్రజాస్వామ్యమా పాడా! పార్టీలో పరిస్థితులు తిరగబడ్డాయి మరదలా! గత ఏడాది చివరిలో, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుతో సహా పలువురు `అధిష్టానమా, అదెక్కడుంది? మాకు తెలిసింది వై.యస్. జగనే' అన్నారు. అయినా ఇప్పటికీ అధిష్టానం ఆ మంత్రుల్ని ఇంటికి పంపలేదు కదా! మంత్రివర్గ విస్త’రణం’ చెయ్యాలంటే అధిష్టానికీ భయమేస్తున్నట్లుంది. అంతగా పరిస్థితులు మారిపోయాయి మరి!

సుబ్బలష్షిమి:
షిప్పులు డింగీలు, డింగీలు షిప్పులూ అవ్వటమంటే ఇదే కాబోలు బావా!

No comments:

Post a Comment